హోలీ ఆడుతుండగా.. లారీ ఢీ; ఇద్దరికి గాయాలు

6 Mar, 2015 16:47 IST|Sakshi

రంగారెడ్డి: హోలీ వేడుకల్లో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లాలోని రాంపల్లిలో హోలీ ఆడుతున్న ఇద్దరు బీటెక్ విద్యార్థులను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారిద్దరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

మరిన్ని వార్తలు