నిజాంసాగర్: నిజామాబాద్ జిల్లా బిచ్కుంద మండలం జగన్నాథపల్లి వద్ద మంగళవారం వేకువజామున హైవే పెట్రోలింగ్ పోలీసుల జీపును ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుళ్లు సాయిబాబ, రాజ్కుమార్కు గాయాలయ్యాయి. వారిని నిజామాబాద్ సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. నాందేడ్ సంగారెడ్డి జాతీయ రహదారిపై వేకువ జామున 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.