కారు - బైక్ ఢీ: ఇద్దరు మృతి

26 Feb, 2016 14:47 IST|Sakshi

నిజామాబాద్ : హైదరాబాద్ - నాగ్పూర్ జాతీయ రహదారిపై నేరేడుకొండ వద్ద శుక్రవారం కారు - బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కారు డ్రైవరును అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం అతడిని పోలీస్ స్టేషన్కి తరలించారు. ఆ తర్వాత మృతదేహాలను స్వాధీనం చేసుకుని... పోస్ట్మార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు