గట్టు మైసమ్మ జాతరలో అపశ్రుతి

18 Apr, 2016 09:43 IST|Sakshi

- కరెంట్ షాక్‌తో ఇద్దరి మృతి

బొమ్మలరామారం(నల్గొండ జిల్లా)

నల్గొండ జిల్లా బొమ్మలరామారం గ్రామంలో జరుగుతున్న గట్టుమైసమ్మ జాతరలో సోమవారం వేకువజామున అపశ్రుతి దొర్లింది. ఈదురుగాలులకు విద్యుత్ తీగ తెగిపడి ఇద్దరు భక్తులు మృత్యువాత పడ్డారు.



బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామానికి చెందిన ఏర్పుల స్వామి(65), నాగారం గ్రామంలోని సత్యనారాయణ కాలనీకి చెందిన ఉప్పునూతల మణికంఠ(21) జాతరకు వచ్చారు. గాలికి తెగి పడిన విద్యుత్ తీగలను గమనించక పోవడంతో... వాటిపై నడుచుకుంటూ వెళ్లారు. కరెంట్ షాక్ కొట్టి ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

 

సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

మరిన్ని వార్తలు