రెండు నెలల చిన్నారి కిడ్నాప్

7 Feb, 2015 22:08 IST|Sakshi

సికింద్రాబాద్: జూబ్లీ బస్టాండ్‌లో శనివారం రాత్రి రెండు నెలల బాబు అపహరణకు గురయ్యాడు. కరీంనగర్ పట్టణానికి చెందిన బుర్రా రజిత(26) తన ముగ్గురు పిల్లలు, తల్లి విజయతో కలసి యాదగిరి గుట్టకు వెళ్లింది. కరీంనగర్‌కు తిరిగి వెళ్తుండగా జూబ్లీ బస్టాండ్‌లో చిన్నారిని పక్కనే ఉన్న ఓ మహిళకు ఇచ్చి బాత్‌రూంకు వెళ్లింది. ఇదే అదునుగా భావించిన ఆ మహిళ చిన్నారితో పరారైంది. చిన్నారి కోసం చుట్టుపక్కల గాలించినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మారేడుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని వార్తలు