లంచం తీసుకుంటూ పట్టుబడిన కానిస్టేబుల్స్‌

10 May, 2020 19:36 IST|Sakshi

కానిస్టేబుల్స్‌ని సస్పెండ్‌ చేసిన సీపీ అంజనీ కుమార్‌

సాక్షి, హైదరాబాద్‌ : గూడ్స్‌ ఆటో డ్రైవర్‌ వద్ద  లంచం తీసుకుంటూ పట్టుబడిన ఇద్దరు కానిస్టేబుల్స్‌ని హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ సస్పెండ్‌ చేశారు. అప్జల్‌ గంజ్‌ పీఎస్‌కు చెందిన కానిస్టేబుల్స్‌ ముఖేష్‌, సురేష్‌  ఆదివారం గూడ్స్‌ ఆటో డ్రైవర్‌  దగ్గర డబ్బులు డిమాండ్‌ చేశారు. ఈ విషయం సీపీ అంజనీ కుమార్‌ దృష్టికి వెళ్లడంతో విచారణ జరిపి ఇద్దరు కానిస్టేబుల్స్‌ను సస్పెండ్‌ చేశారు. అలాగే పర్యవేక్షణా లోపం కారణంగా అఫ్జల్‌గంజ్‌ సీఐకి చార్జ్‌ మెమో జారీ చేశారు.

మరిన్ని వార్తలు