ఎంపీకి బెదిరింపు కాల్స్ ఘటన:ఇద్దరు అరెస్ట్

31 Jan, 2015 21:34 IST|Sakshi

హైదరాబాద్: చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి బెదిరింపు కాల్స్ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి ఈనెల 18వ తేదీన విశ్వేశ్వరరెడ్డి సైబారాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో  దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాజేష్,, వెంకట రామిరెడ్డి అనే ఇద్దరు నిందితులను శనివారం అరెస్ట్ చేశారు. 

 

ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు లెక్కలు చూపించారంటూ బెదిరింపులకు పాల్పడి.. తమకు రూ.25 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు కొండారెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు