సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్(సీపీఆర్వో)గా ఎం.ఉమాశంకర్ కుమార్ శుక్రవారం రైల్ నిలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీర్స్ 1997 బ్యాచ్కు చెందిన ఆయన ఇప్పటివరకు సికింద్రాబాద్ డివిజన్ సిగ్నల్ అండ్ టెలికం ఇంజనీర్గా విధులు నిర్వహించారు.