పెదవేడులో గుప్తనిధుల కోసం తవ్వకాలు

12 Aug, 2015 19:53 IST|Sakshi

రంగారెడ్డి: గుర్తుతెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన సంఘటన మండల పరిధిలోని పెదవేడులో చోటుచేసుకుంది. ఏఎస్‌ఐ మారుతీ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బల్వంత్‌రెడ్డి, తులిసిరెడ్డి ఇళ్ల వెన కాల మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. గమనించిన తులసిరెడ్డి బుధవారం షాబాద్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు