గుర్తుతెలియని బాలికను చేరదీసిన పోలీసులు

21 Apr, 2018 12:04 IST|Sakshi
తప్పిపోయిన బాలికతో ఎస్సై రవి

తాండూర్‌(బెల్లంపల్లి) : ఎక్కడి నుంచో తప్పిపోయి వచ్చిన బాలిక (7)ను శుక్రవారం తాండూర్‌ పోలీసులు చేరదీశారు. తాండూర్‌ మండలం బోయపల్లి శివారులోని మామిడి తోటల సమీపంలో రోడ్డు పక్కన చెట్టు కింద బాలిక కూర్చోని ఉండగా అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎస్సై కె.రవి ఆ బాలికను గమనించి ఆమె వివరాలు అడిగితెలుసుకునే ప్రయత్నం చేశారు.

తనది కెరమెరి గ్రామమని ఓసారి, జోడేఘాట్‌ అని ఓ సారి బాలిక చెప్పడంతో బాలిక వివరాలు తెలియరాలేదు. తప్పిపోయిన బాలిక సంబంధికులు ఎవరైనా ఉంటే తాండూర్‌ పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్సై రవి సూచించారు. 

మరిన్ని వార్తలు