యువకుడ్ని బలి ఇచ్చేందుకు యత్నం!

6 Apr, 2015 18:33 IST|Sakshi

మెదక్:ఆధునిక సమాజంలో కూడా మూడ నమ్మకాల పరంపర కొనసాగుతుందనడానికి ఈ ఘటనే తాజా ఉదాహరణ. గుప్త నిధుల కోసం ఓ యువకుడ్ని బలి ఇచ్చేందుకు యత్నించిన ఘటన జిల్లాలోని నర్సాపూర్ మండలం బ్రాహ్మణపల్లిలోవెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..  గుప్త నిధుల పేరిట నాగరాజు అనే యువకుడ్ని కొంతమంది అపహరించుకుని పోయి బలి ఇవ్వడానికి యత్నించారు.

 

అయితే ఆ యువకుడు దుండగుల నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

మరిన్ని వార్తలు