ఎంజీఎం ఆవరణలో అమానవీయ ఘటన

20 Jul, 2020 18:47 IST|Sakshi

సాక్షి, వరంగల్‌ : నగరంలోని ఎంజీఎం ఆస్పత్రిలో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రి ఆవరణలోని క్యాజువాలిటీ ముందు గుర్తు తెలియని మహిళ మృతదేహం దర్శనమిచ్చింది. కరోనా అనుమానంతో ఆమె బంధువులే ఆస్పతి ముందు స్ట్రెచర్‌పై మృతదేహాన్ని వదిలివెళ్లినట్టుగా తెలుస్తోంది. దాదాపు రెండు గంటల గడుస్తున్న మహిళ మృతదేహం క్యాజువాలిటీ ముందే ఉంది. వర్షంలో మృతదేహం తడుస్తున్నా ఆస్పత్రి సిబ్బంది గానీ, అటుగా వెళ్తున్నవారు గానీ ఎవరు పట్టించుకోవడం లేదు.(ప్రభుత్వాని ఇదే చివరి అవకాశం : హైకోర్టు)

మరిన్ని వార్తలు