రానున్న మూడ్రోజులు తేలికపాటి వర్షాలు

9 Feb, 2019 00:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాల్దీవుల నుంచి తెలంగాణ వరకు ఇంటీరియర్‌ తమిళనాడు, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడటంతో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. శని, ఆదివారాల్లో పొడి వాతావరణం ఉండటంతో ఉదయం పూట పొగమంచు ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. 
 

మరిన్ని వార్తలు