ఖమ్మంరూరల్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో శుక్రవారం జరిగిన ఎట్హోం, రిపబ్లిక్ వేడుకల్లో ఖమ్మం జిల్లా రూరల్ మండలం రెడ్డిపల్లికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య పాల్గొన్నారు. రాష్ట్రపతి భవన్ నుంచి అందిన ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్లిన రామయ్య ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రాంనాథ్ కోవిద్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీలను కలుసుకున్నారు.