నేడు ‘సాక్షి’ సంపాదకుడు మురళికి ‘మాదల’ పురస్కారం 

20 May, 2018 01:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీనియర్‌ పాత్రికేయుడు, సాక్షి దినపత్రిక సంపాదకుడు వర్ధెల్లి మురళి ఈ ఏడాది ప్రతిష్టాత్మక శివశ్రీ మాదల వీరభద్రరావు స్మారక పురస్కారం అందుకోనున్నారు. మాదల వీరభద్రరావు స్మారక సమితి, సాధన సాహితీ స్రవంతి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు చిక్కడపల్లి త్యాగరాయ గాన సభలో పురస్కారం ప్రదానం చేయనున్నారు. కార్యక్రమానికి తమిళనాడు మాజీ గవర్నర్‌ డాక్టర్‌ కొణిజేటి రోశయ్య ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు.

ఈ సందర్భంగా జరిగే సభలో సీనియర్‌ పాత్రికేయుడు డాక్టర్‌ జీఎస్‌ వరదాచారి, ప్రెస్‌ అకాడమీ మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ పొత్తూరి వెంకటేశ్వరరావు, త్యాగరాయగాన సభ అధ్యక్షుడు వీఎస్‌ జనార్ద నమూర్తి, ఆచార్య ముదిగొండ శివప్రసాద్, తెలుగు విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ టి.గౌరీశంకర్‌ తదితరులు పాల్గొంటారని శివశ్రీ మాదల వీరభద్రరావు స్మారక సమితి కార్యదర్శి రాజేంద్రప్రసాద్‌ ఓ ప్రకటనలో తెలిపారు.  

మరిన్ని వార్తలు