సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా హోంశాఖ కార్యదర్శి బి.వెంకటేశన్, డెరైక్టర్లుగా డీజీపీ, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ జేఏండీలను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు కొత్త కంపెనీని రిజిస్టర్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశిస్తూ హోంశాఖ కార్యదర్శి బి.వెంకటేశన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా డెరైక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్గా హోంశాఖ కార్యదర్శి వెంకటేశన్కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.