కల్తీ విత్తన కేంద్రాలపై విజిలెన్స్‌ దాడి

12 Jun, 2019 17:03 IST|Sakshi

హైదరాబాద్‌: నగంరలో కల్తీ విత్తన కేంద్రాలపై  విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు నిర్వహించారు. సిద్ధిపేట్‌ జిల్లా మాదారం గ్రామానికి చెందిన ఎస్‌కే ఖాదర్‌ ఈ కల్తీ విత్తనాలను సరఫరా చేస్తున్నట్లు అధికారుల విచారణలో తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. వీరి వద్ద నుంచి 45 కేజీల బరువు గల మూడు బ్యాగ్‌ల కల్తీ విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

పల్లవి-12, గోఖుల్‌, కృష్ణ-10 పేరు గల 25 ప్యాకెట్ల కల్తీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్‌ ఎస్పీ అన్నపూర్ణ వివరించారు. వీటి మొత్తం విలువ భారీగా ఉండవచ్చునని చెప్పారు. ఈ కల్తీ విత్తనాలు కర్నూలు నుంచి గుంటూరు మీదుగా నగరానికి వస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. రైతులు విత్తనాలు కొనేటప్పుడు కేవలం లైసెన్స్‌ డీలర్ల వద్దనే కొనాలని సూచించారు.

మరిన్ని వార్తలు