కేఎల్‌ఎం మాల్‌లో ‘గీతగోవిందం’

3 Oct, 2018 08:45 IST|Sakshi

గీత గోవిందం ఫేం హీరో హీరోయిన్లు విజయ్‌దేవరకొండ, రష్మికలు చందానగర్‌లో సందడి చేశారు. మంగళవారం వీరు ఇక్కడ కేఎల్‌ఎం ఫ్యాషన్‌ మాల్‌ను ప్రారంభించారు.  

మియాపూర్‌: ‘గీత గోవిందం’ సినిమా హీరోవిజయ్‌ దేవరకొండ, హీరోయిన్‌ రష్మిక మండన్న మంగళవారం చందానగర్‌లో సందడి చేశారు. ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన కేఎల్‌ఎం ఫ్యాషన్‌ మాల్‌ను వారు ప్రారంభించారు. విజయ్‌ను చూసేందుకు అభిమానులు కేరింతలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ.. అబ్బుపరిచే అంతర్జాతీయ ఫ్యాషన్‌ దుస్తులు కేఎల్‌ఎం మాల్‌ అందుబాటులోకి
తీసుకురావడం అభినందనీయమన్నారు.కార్యక్రమంలో నిర్వాహకులు కళ్యాణ్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు