జర్నలిస్టు విజయ్‌కుమార్ మృతికి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం

12 Oct, 2014 00:46 IST|Sakshi

హైదరాబాద్: కరీంనగర్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టు జీవగడ్డ విజయ్‌కుమార్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కరీంనగర్ కేంద్రంగా విద్యుల్లత, జీవగడ్డ పత్రికలు నడిపిన విజయ్‌కుమార్ జీవితాంతం వృత్తిపట్ల పూర్తి నిబద్ధత ప్రదర్శించారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఆయన ఎంతో మంది జర్నలిస్టులకు గురువుగా తన జీవితాన్ని సార్థకం చేసుకున్నారని కొనియాడారు.
 
 
 
 

మరిన్ని వార్తలు