విశ్వరూప విజయవంతం

9 Sep, 2014 00:53 IST|Sakshi
విశ్వరూప విజయవంతం

చంద్రకాంతులు వెదజల్లుతున్న వేళ... భక్తుల జయజయధ్వానాల మధ్య కైలాస విశ్వరూప మహాగణపతి దుర్గామాత వెంటరాగా ‘మహా’రథంపై ఆశీనుడయ్యాడు. వేల మెగావాట్ల విద్యుత్ దీప కాంతుల మధ్య జరిగిన ఈ మహత్తర ఘట్టాన్ని వీక్షించి భక్తకోటి తరించింది. ‘జై బోలో గణేశ్ మహరాజ్ కీ’ అంటూ స్తుతించింది. ఆనంద పరవశంతో నర్తించింది. వెరసి ‘ఆపరేషన్ విశ్వరూప’ విజయవంతమైంది. సోమవారం అర్ధరాత్రి సమీపిస్తున్న తరుణంలో భారీగణపయ్య గంగ ఒడికి కదిలాడిలా..!   
 
 అపురూప ఘట్టాలు..
 మధ్యాహ్నం 3 గంటలకు:  క్రేన్ మహాగణపతి ప్రాంగణానికి చేరుకుంది.
 3.20: భారీ వాహనం పొజిషన్ తీసుకుంది.
 4.00: భక్తుల దర్శనం నిలిపివేశారు.
 4.50: లక్ష్మీనర్శింహ స్వామి విగ్రహాన్ని కదిలించేందుకు క్రేన్ సిద్ధమైంది.
 5.00: భక్తులు ఎక్కువగా ఉండడంతో వారిని మళ్లీ దర్శనానికి అనుమతించారు.
 6.00: తిరుమల తిరుపతి దేవస్థానం కళాకారుల కోలాట ప్రదర్శన
 6.10: క్రేన్‌కు పూజలు
 7.30: లక్ష్మీ నర్శింహ స్వామి విగ్రహాన్ని పైకి లేపి మండపానికి దూరంగా పెట్టారు.
 8.00: లడ్డూపై నున్న గొడుగును తొలగించారు.
 8.30: లడ్డూని కిందకు దించారు.
 9.50: దుర్గామాత విగ్రహాన్ని పైకిలేపి వాహనంపై ఉంచారు.
 9.55: కైలాస విశ్వరూపుడి విగ్రహానికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి చివరి పూజ చేశారు.
 10.10: మహాగణపతిని పైకి లేపేందుకు విగ్రహం అడుగుభాగంలో వైర్లను అమర్చారు.
 10.15: భారీ వినాయకుడిని వాహనంపై అమర్చేందుకు గ్రీన్‌సిగ్నల్ లభించింది.
 10.35: కైలాస విశ్వరూపుడి విగ్రహాన్ని కొంచెం కదిలించారు.
 10.55: భారీ గణనాథుడ్ని వాహనంపై అమర్చారు.
 11.00: వాహనానికి వెల్డింగ్ పనులు మొదలయ్యాయి.
 అర్ధరాత్రి తర్వాత విశ్వరూపుడు శోభాయాత్రకి కదిలాడు.
 

మరిన్ని వార్తలు