సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నలుగురు సీనియర్ ఐపీఎస్లను బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా ఉన్న వీకే సింగ్ను పోలీస్ అకాడమీ డైరెక్టర్గా నియమించారు. పోలీస్ అకాడమీ డైరెక్టర్గా ఉన్న సంతోష్ మెహ్రాను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. సంజయ్ కుమార్ను ఫైర్ సర్వీస్ డీజీగా నియమించగా, ఫైర్ సర్వీస్ డీజీగా ఉన్న గోపీకృష్ణను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా బదిలీ చేశారు.