ఓటు.. మన బాధ్యత : కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌

1 Dec, 2018 09:05 IST|Sakshi
తప్పక ఓటు వేయాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు.

ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి.. 

అప్పుడే ప్రజాస్వామ్యానికి రక్షణ 

‘ఓటు దీపోత్సవంలో’ కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ 

సాక్షి, పాలమూరు: ఓటు హక్కు ఉన్న ప్రతీ ఒక్కరు ఓటు వేయాలని.. తద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవచ్చని కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ అన్నారు. అందరూ ఓటు వేస్తూ ప్రజాస్వామ్యమనే దీపాన్ని వెలిగించాలని కోరారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ మైదానంలో శుక్రవారం రాత్రి ‘ఓటు  దీపోత్సవం’ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా పట్టణానికి చెందిన మహిళలు దీపాలు వెలిగించారు. అనంతరం కలెక్టర్‌ చేతిలో దీపం పట్టుకుని రానున్న ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటామంటూ మహిళలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జేసీ వెంకట్రావు, డీఎంహెచ్‌ఓ రజిని, డీఈఓ సోమిరెడ్డి, ఈఎస్‌ అనితతో పాటు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.  

ఓటు దీపోత్సవం
ప్రస్తుతం కార్తీకమాసం.. త్వరలోనే ఎన్నికల పోలింగ్‌.. ఈ రెండూ కలిసొచ్చేలా జిల్లా కేంద్రంలో శుక్రవారం వినూత్న కార్యక్రమం చేపట్టారు.  జెడ్పీ మైదానంలో ‘ఓటు దీపోత్సవం’ పేరిట ఈ కార్యక్రమం ఏర్పాటుచేయగా కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌తో పాటు అన్ని జిల్లా శాఖల ఉన్నతాధికారులు, మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈ మేరకు ‘ఐ ఓట్‌’ అక్షరాల రూపంలో దీపాలు వెలిగించారు. అనంతరం ఓటు హక్కు ప్రాధాన్యం, ఓటర్లకు కల్పిస్తున్న సౌకర్యాలను మహిళలకు వివరించి∙


 

మరిన్ని వార్తలు