సాక్షి, కాజీపేట: ఎన్నికలు సక్రమంగా నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ బూత్లెవల్ అవేర్నెస్ గ్రూప్స్(బ్లాగ్)ను ప్రతి పోలింగ్ కేంద్రానికి ఏర్పాటు చేసింది. ప్రభుత్వ, సెమీ ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి, స్థానిక ఓటర్లతో పరిచయం ఉండి, ఆ ప్రాంతంలో ఓటు హక్కు కలిగి ఉన్న స్థానిక వ్యక్తులను, ఎటువంటి రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఉన్న వారిని అధికారులు బ్లాగ్స్లో సభ్యులుగా నియమిస్తా రు. ప్రతి బ్లాగ్స్లో బీ ఎల్వో బృంద నాయకునిగా ఉండగా ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడు, ఆశావర్కర్, ఏఎన్ఎం, అంగన్వాడీ టీచర్, మహిళా సంఘాల బుక్కీపర్లను సభ్యులుగా నియమిస్తూ ఎన్నికల అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు వారందరికీ నియామకపు ఉత్తర్వులు జారీచేయడమే కాకుండా విధి నిర్వహణ పట్ల అవగాహన కల్పించారు.
బ్లాగ్ బాధ్యతలు ఇలా...