సభా కమిటీల్లో మనోళ్లు!

24 Sep, 2019 11:41 IST|Sakshi

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు స్థానం

ఉమ్మడి జిల్లాలో పలువురికి అవకాశం కల్పించిన సీఎం

సాక్షి , వరంగల్‌: సభా కమిటీల్లో వరంగల్‌ ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులకు అవకాశం దక్కింది. మంత్రివర్గ విస్తరణ సమయంలో సభా కమిటీల్లోను ఓరుగల్లుకు పెద్దపీట వేయనున్నట్లు గులాబీ దళపతి, సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఈ మేరకు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల చివరి రోజున ఉమ్మడి సభా కమిటీలను మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. ఈ కమిటీల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించారు. ఆయా కమిటీల వివరాలిలా ఉన్నాయి.

  •  జోనల్‌ రైల్వే యూజర్స్‌ కన్సల్టేటివ్‌ కమిటీ సర్వీస్‌ మెంబర్‌ : నన్నపనేని నరేందర్‌ (వరంగల్‌ తూర్పు)

అసెంబ్లీ కమిటీలు

  •  రూల్స్‌ కమిటీ సభ్యుడిగా గండ్ర వెంకటరమణరెడ్డి(భూపాలపల్లి)
  •  ప్రివిలేజ్‌ కమిటీ సభ్యుడిగా డాక్టర్‌ టి.రాజయ్య (స్టేషన్‌ఘన్‌పూర్‌)
  •  కమిటీ అన్‌ గవర్నమెంట్‌ అక్యూరెన్స్‌ సభ్యుడిగా చల్లా ధర్మారెడ్డి (పరకాల)

ఫైనాన్షియల్‌ కమిటీలు

  •  పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ సభ్యుడిలుగా పెద్ది సుదర్శన్‌రెడ్డి(నర్సంపేట), పల్లా రాజేశ్వర్‌రెడ్డి (పట్టభద్రుల ఎమ్మెల్సీ)
  •  కమిటీ ఆన్‌ ఎస్టిమేట్స్‌ సభ్యుడిగా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి(జనగామ)
  •  కమిటీ ఆన్‌ పబ్లిక్‌ అండర్‌ టేకింగ్‌ సభ్యుడిగా బానోతు శంకర్‌నాయక్‌(మహబూబాబాద్‌)

లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ కమిటీలు

  •  రూల్స్‌ కమిటీ సభ్యుడిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి (పట్టభద్రుల ఎమ్మెల్సీ)
  •  పిటీషన్స్‌ కమిటీ సభ్యుడిగా పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి(స్థానిక సంస్థల ఎమ్మెల్సీ)

వెల్ఫేర్‌ అండ్‌ అదర్‌ జాయింట్‌ కమిటీలు

  •  అమెనిటీస్‌ కమిటీ సభ్యులుగా దాస్యం వినయ్‌భాస్కర్‌(వరంగల్‌ పశ్చిమ), పల్లా రాజేశ్వర్‌రెడ్డి (పట్టభద్రుల ఎమ్మెల్సీ)
  •  వెల్ఫేర్‌ ఆఫ్‌ షెడ్యూల్‌ క్యాస్ట్‌ కమిటీ సభ్యులుగా ధనసరి అనసూయ(ములుగు)
  •  వెల్ఫేర్‌  ఆఫ్‌ షెడ్యూల్‌ ట్రైబ్స్‌ సభ్యుడిగా బానోతు శంకర్‌నాయక్‌(మహబూబాబాద్‌)
  •  వెల్ఫేర్‌ ఆఫ్‌ బ్యాక్‌ వర్డ్‌ క్లాసెస్‌ సభ్యుడిగా నన్నపనేని నరేందర్‌(వరంగల్‌ తూర్పు), పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (స్థానిక సంస్థల ఎమ్మెల్సీ)
  •  లైబ్రరీ కమిటీ సభ్యులుగా చల్లా ధర్మారెడ్డి (పరకాల), ధనపరి అనసూయ(ములుగు) 

మరిన్ని వార్తలు