నిజాంసాగర్ నుంచి నీటి విడుదల

20 Feb, 2015 20:49 IST|Sakshi

నిజామాబాద్: నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి 1200 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువ ద్వారా శుక్రవారం రాత్రి 7 గంటలకు విడుదల చేశారు. నాలుగు రోజుల పాటు నీటిని విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. నిజామాబాద్, బోధన్ పట్టణ ప్రజల తాగునీటి అవసరాల కోసం ఈ నీటిని విడుదల చేసినట్లు నిజాంసాగర్ ప్రాజెక్టు ఎక్సిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ) సత్య శీలా రెడ్డి తెలిపారు.
(నిజాంసాగర్)

మరిన్ని వార్తలు