'ఏపీ ప్రజలతో మాకు శత్రుత్వం లేదు.. బాబుది తప్పే'

11 Jun, 2015 16:38 IST|Sakshi

హైదరాబాద్: ఇప్పటికైనా తన తప్పును ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒప్పుకోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బిగాల గణేష్ డిమాండ్ చేశారు. ఏపీ ప్రజలతో మాకు ఎలాంటి శత్రుత్వం లేదని చెప్పారు. ఓటుకు నోటు వ్యవహారంలో టీడీపీ క్రమశిక్షణ తప్పిందని ఆరోపించారు. తప్పు చేసినందుకే చంద్రబాబునాయుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, అసలు రేవంత్ రెడ్డి కేవలం పాత్రధారేనని.. సూత్రధారి మాత్రం చంద్రబాబు అని చెప్పారు.

మరిన్ని వార్తలు