వైద్యరంగంలో టెక్నాలజీకి కొదవలేదు: ఈటల

5 Jan, 2020 02:19 IST|Sakshi

మాదాపూర్‌: వైద్యరంగంలో సాంకేతిక పరిజ్ఞానానికి కొదవలేదని, దీనిని ఉపయోగించుకుని ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో శనివారం మూడ్రోజుల పాటు నిర్వహించను న్న ఇండియా మెడ్‌ఎక్స్‌పోను నిర్వాహకులతో కలసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఈ ప్రదర్శనల ఏర్పాటుతో ఉత్పత్తి తయారీ దారుల యూనిట్లకు ఉత్పత్తులను ప్రమోట్‌ చేసుకునేందుకు వీలుంటుందన్నారు. ప్రదర్శనలో 200  అంతర్జాతీయ కం పెనీలు పాల్గొన్నాయి. మెడికల్, సర్జికల్, టెక్నాలజీ ఉత్పత్తులు 5000 బ్రాండ్‌లు పాల్గొన్నాయి. 

>
మరిన్ని వార్తలు