'ఎన్టీఆర్ పేరు పెడితే చూస్తూ ఊరుకోం'

1 Jun, 2014 14:30 IST|Sakshi
'ఎన్టీఆర్ పేరు పెడితే చూస్తూ ఊరుకోం'

మంథని: తెలంగాణలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలని టీడీపీ ప్రతిపాదించడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. అధికారం ఉందని ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతిపక్ష పార్టీగా చూస్తూ ఊరుకునేది లేదన్నారు. కరీంనగర్ జిల్లా మంథనిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి రాజీవ్‌గాంధీ పేరిట నామకరణం చేశారన్నారు. కాగా, తెలంగాణ ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండానే పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రలో కలిపేందుకు బీజేపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చిందని ఆరోపించారు.

మరిన్ని వార్తలు