మావోయిస్టులపై నిషేధం ఎత్తివేయం: నాయిని

3 Jun, 2014 03:48 IST|Sakshi
మావోయిస్టులపై నిషేధం ఎత్తివేయం: నాయిని
సాక్షి, హైదరాబాద్: శాంతిభద్రతలు ఎంత అదుపులో ఉంటే రాష్ట్రం అంత బాగా అభివృద్ధి చెందుతుందని కొత్తగా హోంమంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించిన నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం తన నివాసంలో ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు.
 
తెలంగాణ రాష్ట్రంలో మత సామరస్యం కాపాడాలనేదే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం మావోయిస్టుల కార్యకలాపాలు పెద్దగా లేవని, అయితే సానుభూతి పరులు మాత్రం అక్కడకక్కడ ఉన్నారన్నారు. మావోయిస్టులు పౌర సమాజంలోకి రానప్పుడు వారిపై నిషేధం ఎత్తివేసే సమస్యే లేదన్నారు.

 

 
మరిన్ని వార్తలు