గిరిజన దర్బార్‌కు హాజరైన విప్, ఎమ్మెల్యేలు

21 Feb, 2016 15:38 IST|Sakshi

ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలం తిమ్మాపూర్ గ్రామపంచాయతీ శివారులోని గాంధారి ఖిల్లా ఆదివారం గిరిజన భక్తులతో కిటికిటలాడింది. మూడు రోజులుగా జరుగుతున్న మైసమ్మ జాతరలో భాగంగా చివరిరోజైన ఆదివారం వేలాదిగా గిరిజనులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఆదివాసీల సమస్యలు తెలుసుకునేందుకు దర్బార్ నిర్వహించారు. దీనికి ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు, ఎమ్మెల్యేలు కోవాలక్ష్మి, దివాకర్‌రావు, ఎమ్మెల్సీ పురాణం సతీష్ హాజరయ్యారు.
 

మరిన్ని వార్తలు