మనస్తాపంతో మహిళ ఆత్మహత్య

20 Nov, 2015 16:46 IST|Sakshi

బొమ్మరాస్‌పేట (మహబూబ్ నగర్) : ఓ వివాదంలో తనను తిట్టినందుకు మనస్తాపం చెందిన ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా బొమ్మరాస్‌పేట మండలం సుంకిమెట్ల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చిన్నమల్లయ్య కుమార్తె జోగు లలిత (28)కు పదేళ్ల క్రితం కోస్గి మండలం నాచారాం గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహం అయింది. భర్తతో మనస్పర్థలు రావడంతో లలిత తండ్రి దగ్గరే ఉంటోంది.

ఈ క్రమంలో గురువారం రాత్రి చిన్నమల్లయ్యకు దాయాదులతో గొడవ జరిగింది. లలిత కూడా ఇందులో జోక్యం చేసుకుంది. దీంతో వారు లలితను దూషించారు. మనస్తాపం చెందిన ఆమె రాత్రి పురుగుల ముందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను కొడంగల్ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ లలిత శుక్రవారం మృతి చెందింది. చిన్నమల్లయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
 

మరిన్ని వార్తలు