కడుపు నొప్పి తాళలేక...

23 Oct, 2015 18:50 IST|Sakshi

కీసర: రంగారెడ్డి జిల్లాలో కడుపునొప్పి భరించలేక శుక్రవారం ఓ వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కీసరకు చెందిన భవాని(22)కి అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్తో రెండేళ్ల కిందట వివాహమైంది.

ఈ క్రమంలో భవాని గత కొన్ని రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతోంది. నొప్పి భరించలేక శుక్రవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటన గమనించిన స్థానికులు ఆమెని ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందింది.

 

మరిన్ని వార్తలు