ఒకే కాన్పులో.. ఇద్దరు బాబులు, ఒక పాప

23 Jun, 2019 15:44 IST|Sakshi

సాక్షి, జగిత్యాల : జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో అరుదైన ప్రసవం జరిగింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం చింతపల్లి గ్రామానికి చెందిన గర్భిణి శిరీష ముగ్గురు శిశువులకు జన్మనిచ్చారు. వీరిలో ఇద్దరు బాబులు, ఒక పాప ఉన్నారు. ప్రస్తుతం తల్లి, ముగ్గురు పిల్లల ఆరోగ్యంగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. తొలి కాన్పులోనే శిరీష ముగ్గరు పిల్లలకు జన్మనివ్వడం పట్ల ఆమె భర్త మహేశ్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు