విద్యుదాఘాతంతో మహిళ మృతి

28 Sep, 2015 21:51 IST|Sakshi

విద్యుదాఘాతంతో ఓ మహిళ దుర్మరణం చెందింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. మండలంలోని క్రిష్ణాపురంలోని బేట్టే తండాకు చెందిన రామావత్ శారదకు ఇంట్లో కరెంటు వైరులు తగలి షాక్ కొట్టింది. దీంతో శారద అక్కడికక్కడే మృతి చెందింది. అయితే మరో మహిళకు కూడా షాక్ తగలినప్పటికీ స్వల్పగాయాలతో బయటపడింది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
 

మరిన్ని వార్తలు