గ్రామస్థులు నిలదీయడంతో వెలుగులోకి విషయం

14 Jul, 2020 20:24 IST|Sakshi

సాక్షి, వికారాబాద్‌: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన ఈనెల 7వ తేదీన జరిగింది. రంగారెడ్డి జిల్లా చేగురూకు చెందిన బైండ్ల చెన్నయ్య(38)ను అతడి భార్య శశికళ, ఆమె ప్రియుడు కలిసి అనంతగిరి అడవిలో హత్య చేశారు. చెన్నయ్య మృతిపై అనుమానం రావడంతో గ్రామస్థులు ప్రియుడిని నిలదీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. విషయం బయటకు రావడంతో మృతుడి భార్య శశికళ కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నంచింది. దీంతో స్థానికులు మంటలు ఆర్పి  ఆమెను ఆసుపత్రి తరలించగా ప్రస్తుతం శశికళ ఆరోగ్య పరిస్థితి విషయంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

చదవండి: విశాఖ ప్రమాదం.. అనాథలైన పిల్లలు

మరిన్ని వార్తలు