సాక్షి, హైదరాబాద్: అసలే మధ్య తరగతి కుటుంబం. లక్షల్లో ఒక్కరికి వచ్చే ప్రాణాంతక వ్యాధి ఆమెకు సోకింది. పది నెలలుగా ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు. అయినా వ్యాధి తగ్గలేదు. సర్జరీ చేయా లని, అందుకు రూ.25 లక్షలు కావాలని వైద్యులు చెప్పారు. కానీ, ఆ కుటుంబానికి అంత ఆర్థిక స్థోమత లేక ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తోంది. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ గుడిబండల్కు చెందిన మూల కుమారస్వామి భార్య కవిత గత జూన్లో అనారోగ్యానికి గురయ్యారు. స్థానిక ఆస్పత్రిలో చేర్పించగా ప్లేట్లెట్స్ తగ్గి ఎముక మజ్జ పూర్తిగా దెబ్బతిందని వైద్యులు చెప్పారు. దీంతో హైదరాబాద్లోని బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో చేర్పించారు.
కుమారస్వామికి ఉన్న ఈఎస్ఐ సదుపాయంతో చికిత్స ప్రారంభించారు. ఇంజెక్షన్లతో వ్యాధి నయం కాలేదు. దీంతో ఆమెకు ఎముక మజ్జ మార్పిడి సర్జరీ చేయా లని వైద్యులు స్పష్టం చేశారు. అంత డబ్బు తన వద్ద లేకపోవడంతో కుమారస్వామి దాతల సహాయాన్ని కోరుతున్నారు. పెద్ద మనసుతో స్పందించి తన భార్యను ప్రాణాంతక వ్యాధి నుంచి రక్షించాలని వేడుకుంటున్నారు.
బ్యాంకు ఖాతా వివరాలు:
ఖాతా నంబరు: 625202010001978
ఐఎఫ్ఎస్సీ కోడ్: యూబీఐఎన్0562521
పేరు: మూల కుమారస్వామి, బ్యాంక్: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
బ్రాంచి: సుబేదారి, హన్మకొండ, గూగుల్ పే నంబరు: 9849822454