మహిళ మెడలో గొలుసు చోరీ

26 Sep, 2015 18:16 IST|Sakshi

నల్లగొండ (తిరుమలగిరి) : నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలానికి చెందిన బొబ్బలి పిచ్చమ్మ అనే మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ జరిగింది. శనివారం మండల కేంద్రానికి సమీపాన ఉన్న ఓ వ్యవసాయ బావి వద్ద గేదెలు మేపుతుండగా బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు మహిళను బెదిరించి మెడలో ఉన్న బంగారు గొలుసును ఎత్తుకెళ్లారు. మహిళ అరిచినా దగ్గరలో ఎవరూ లేకపోవడంతో లాభం లేకుండా పోయింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

మరిన్ని వార్తలు