బాత్‌రూం గోడకూలి బాలింత మృతి

4 Sep, 2017 01:20 IST|Sakshi
హసన్‌పర్తి: బాత్‌రూం గోడకూలి ఓ బాలింత మృతిచెందగా, ఆమె తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. వరంగల్‌ అర్బన్‌ జిల్లా మల్లారెడ్డిపల్లికి చెందిన రాయరాకుల రాజమౌళి–మంజుల దంపతుల రెండో కూతురు అనూష(22)ను తాటికొండకు చెందిన అక్కన్నపల్లి మహేశ్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. 15 రోజుల క్రితం ఆమె ఆడశిశువుకు జన్మనిచ్చింది.

కాగా, ఆదివారం అనూషకు స్నానం చేయించేందుకు తల్లి మంజుల ఆమెను బాత్‌రూంకు తీసుకెళ్లింది. ఈ క్రమంలో శనివారం రాత్రి కురిసిన వర్షానికి గోడలు నానిపోయి ప్రమాదవశాత్తు వారిపై కూలాయి. దీంతో తీవ్రంగా గాయపడిన తల్లీకూతుళ్లను కుటుంబసభ్యులు వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా.. అనూష మృతిచెందింది.
మరిన్ని వార్తలు