మహిళ అనుమానాస్పద మృతి

29 Jan, 2015 18:38 IST|Sakshi

కరీంనగర్: కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలోని ఎల్బీనగర్ కాలనీకి చెందిన మహిళ అనుమానాస్పదంగా మృతిచెందింది. కాలనీకి చెందిన దాసరి పద్మ(38) గురువారం మధ్యాహ్నం ఇంట్లో అచేతనంగా పడి ఉంది.

ఇది గమనించిన వారు పరిశీలించి చూడగా ఆమె మృతిచెంది ఉంది. ఎలా మరణించిందనే విషయం తెలియరాలేదు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

మరిన్ని వార్తలు