రైలు కిందపడి మహిళ ఆత్మహత్య

7 Jul, 2015 13:35 IST|Sakshi

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని తాండూరు మండల కేంద్రానికి సమీపంలోని రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని మహిళ ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం ఉదయం ఆ ప్రాంతంలో అనుమానంగా తిరుగుతుండటంతో కొందరు స్థానికులు ఆమెను వారించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. తిరిగి మధ్యాహ్నం ట్రాక్ వద్దకు చేరుకున్న మహిళ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు