మహిళా దొంగ అరెస్టు

4 Sep, 2015 14:19 IST|Sakshi

ముదిగొండ: ఖమ్మం జిల్లాలో ఓ మహిళా దొంగ పోలీసులకు చిక్కింది. ఈ ఘటన మదిగొండ మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. జిల్లాలోని చింతకాని మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన పసుపు లేటి పద్మ జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోరీకి పాల్పడింది. ఆమెను మదిగొండ పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు. నిందితురాలు నుంచి రూ 6.5 లక్షల విలువు చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

 

మరిన్ని వార్తలు