కమలాపూర్ మండలం గోపాల్పూర్లో మంగళవారం కుడుతుల సత్తమ్మ(50) అనే మహిళా కౌలు రైతు ఆత్మహత్య చేసుకుంది. కౌలుకు తీసుకున్న పొలంలో పంట సరిగా పండక పోవడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది.