రసాయన వాయువులు లీక్ : కార్మికుడి మృతి

9 Jun, 2015 19:33 IST|Sakshi

చౌటుప్పల్ : నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపురంలోని ఓ కంపెనీలో జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం సాయంత్రం మల్కాపురంలోని శ్రీ జయ లేబొరేటరీస్‌లో రసాయన వాయువులు లీక్ అవ్వడంతో.. అవి పీల్చిన నలుగురు కార్మికులు స్పృహ తప్పి పడిపోయారు. వారిని హుటాహుటిన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఓ కార్మికుడు మృతి చెందాడు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు