ఆగస్టులో ‘పోలీసు’ రాత పరీక్ష

12 Jun, 2018 01:37 IST|Sakshi

రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ వి.వి. శ్రీనివాసరావు

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పోలీస్‌ ఉద్యోగాల (18,428 పోస్టులు) భర్తీకి సంబంధించిన రాత పరీక్షను ఆగస్టులో నిర్వహించనున్నట్లు తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు తెలిపారు. టీ–శాట్‌ నెట్‌వర్క్‌ చానల్‌ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన నియామకాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఎనిమిది నెలల్లో నియామకాల ప్రక్రియను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, ఏమైనా అనుమానాలుంటే బోర్డు హెల్ప్‌లైన్, వెబ్‌సైట్‌లో సంప్రదించాలని అభ్యర్థులకు సూచించారు. 

మరిన్ని వార్తలు