బంగారు తాపడం కోసం తరలించిన యాదాద్రి అధికారులు
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ అభివృద్ధి పనుల్లో భాగంగా సప్త రాజగోపురాలు, సుదర్శన రాజగోపురం, ధ్వజస్తంభం, బలి పీఠం అందంగా తయారు కానున్నాయి. తిరుమల తరహాలో వీటిని ఏర్పాటు చేయడానికి వైటీడీఏ అధికారులు సన్నాహాకాలు చేస్తున్నారు. ఇందుకోసం రాగి కవచాలను బంగారు తాపడం కోసం ఆదివారం తమిళనాడుకు తరలించారు. దాదాపు రూ.1.5 కోట్లతో బంగారు తాపడం పనులకు శ్రీకారం చుట్టారు. రెండు నెలల్లో బంగారు తాపడం పనులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు. వీటితో పాటు గర్భాలయ ద్వారాలకు అమర్చేందుకు అందమైన చక్రాలు, చిత్రాలతో కూడిన రాగి వస్తువులను, చేతి పట్టుకు అవసరమైన పీడీలను, దశావతారాల విగ్రహాలను తయారు చేశారు. వీటన్నింటినీ బంగారు తాపడం కోసం తమిళనాడుకు తరలించారు.
గర్భాలయం ద్వారంపై అమర్చే చక్రాలు