జగిత్యాల జోన్: యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా స్పెషల్ సబ్ జైలులో ఖైదీలు పలు యోగా విన్యాసాలు చేశారు. ఖైదీలతో పాటు జైలు సిబ్బంది సైతం యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా జైలర్ ప్రేమ్కుమార్ మాట్లాడుతూ.. యోగాతో ఆరోగ్యంతోపాటు మనస్సుకు ప్రశా ంతత కలుగుతుందని పేర్కొన్నారు. యోగా సనా లు ప్రతి ఒక్కరి దినచర్యలో భాగం కావాలని కో రారు. జైలు నుండి వెళ్లిన తర్వాత సైతం యోగాసనాలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జైలువార్డర్లు, జైలు సిబ్బంది పాల్గొన్నారు.