అప్పులబాధతో యువరైతు ఆత్మహత్య

12 Aug, 2015 18:42 IST|Sakshi

నల్లగొండ: అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం సింగారం గ్రామంలో బుధవారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన వెంకటేశం(28) తనకున్న నాలుగెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ సంవత్సరం తన భూమితో పాటు మరో ఐదెకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి పంట వేశాడు. దీని కోసం రూ. 5 ల క్షల వరకు అప్పు చేశాడు. సరైన వర్షాలు లేక విత్తనాలు మొలకెత్తకపోవడంతో.. మనస్తాపం చెందిన వెంకటేశం ఈరోజు పొలం దగ్గర పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.


విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతునికి భార్యా ఇద్దరు పిల్లలున్నారు.
 

మరిన్ని వార్తలు