రియాక్టర్‌ పేలుడు: యువకుడు మృతి

1 Aug, 2017 13:01 IST|Sakshi
కొమురవెల్లి:  హైదరాబాద్‌లోని రెడ్డి ల్యాబ్‌లో గ్యాస్ రియాక్టర్ పేలిన ఘటనలో సిద్దిపేట జిల్లా కొమురవెల్లికి చెందిన సార్ల మహేష్ (20) అనే యువకుడు మృతిచెందాడు. ఈ ల్యాబ్‌లో గ్యాస్ రియాక్టర్ వద్ద మహేష్‌, మరో ఇద్దరు సోమవారం రాత్రి పనిచేస్తున్న సమయంలో అత్యధిక వేడితో రియాక్టర్‌ పేలింది. దీంతో అతని ముఖం కాలిపోయి తీవ్రంగా గాయపడగా.. ఎల్‌బీనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందాడు. మిగతా ఇద్దరు చికిత్స పొందుతున్నారు. మహేష్‌ కుటుంబీకులు, బంధువులు హుటాహుటిన ఆస్పత్రికి తరలి వచ్చారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అందజేసినట్లు తెలుస్తోంది.
మరిన్ని వార్తలు