మెహెందీ కోసం వెళ్లి...

1 Jun, 2016 19:29 IST|Sakshi

జియాగూడ (హైదరాబాద్) : మెహెందీ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి తిరిగి రాలేదు. కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... జియాగూడ ఇంద్రానగర్‌లో నివాసం ఉంటున్న రాణిభాయ్, దుర్గాసింగ్‌ల కుమార్తె మమ్మీ ఎలియాస్ జయా (26) మంగళవారం మధ్యాహ్నం మెహెందీ కోన్ తెచ్చుకుంటానంటూ బయటకువెళ్లింది. రాత్రయినా తిరిగి రాకపోవడంతో వారు చుట్టు పక్కల ప్రాంతాల్లో విచారించారు. ఫలితం లేకపోవడంతో పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు