పెళ్లి ముహూర్తాలు లేవని ఉరేసుకున్నాడు

19 Jun, 2015 17:44 IST|Sakshi
పెళ్లి ముహూర్తాలు లేవని ఉరేసుకున్నాడు

ధన్వాడ (మహబూబ్‌నగర్) : వివాహ ముహూర్తాలు లేవని, మరో ఏడాది వరకు ఆగాల్సిందేనని పెద్దలు చెప్పటంతో ఓ యువకుడు మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా ధన్వాడ మండలం రాంకిష్టాయపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...రాంకిష్టాయపల్లి గ్రామానికి చెందిన ఒగ్గు మహేష్(22) గొర్రెల  కాపరిగా జీవితం సాగిస్తున్నాడు. కొన్ని నెలలుగా కరీంనగర్ జిల్లాలో జీవాలు మేపుకుంటున్నాడు. కాగా కుటుంబసభ్యుల సూచన మేరకు పెళ్లి సంబంధాలు చూసేందుకు ఇటీవలే స్వగ్రామానికి చేరుకున్నాడు. అయితే మహేష్ పేరుతో ఒక ఏడాది వరకు మంచి ముహూర్తం లేదని పెద్దలు తెలిపారు. పెళ్లి చేసుకోవాలని ఆత్రుత పడిన మహేష్ ఈ విషయం తెలిసి తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. శుక్రవారం గ్రామ శివారులోని పొలంలో ఉన్న పశువుల పాకలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

>
మరిన్ని వార్తలు